జీతం కోసం నాలుగేళ్ల పాటు ఎదురు చూపులు

1:34 AM

(0) Comments

తుది వేతన పత్రాన్ని (ఎల్‌పీసీ) అందజేయకుండా మహిళా ఉద్యోగిని నాలుగేళ్ల పాటు ఇబ్బందులకు గురి చేసిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ మానవహక్కుల కమిషన్ చొరవతో దిగివచ్చారు. సీల్డ్‌కవర్‌లో ఎల్‌పీసీని కమిషన్ ఛైర్మన్‌కు అందజేయటంతో వేతనం తీసుకునేందుకు ఆమెకు అడ్డంకి తొలగినట్లైంది.

డైరెక్టర్ గణాంకాల విభాగంలో డివిజనల్ అకౌంట్స్ అధికారి (డీఏఓ)గా పనిచేస్తున్న కె.శైలజ డిప్యూటేషన్‌పై 2000 సంత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డీఏఓగా విధుల్లోకి చేరింది. 2003 లో ఆమెను మాతృసంస్థకు పంపుతూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. శైలజకు ఎల్‌పీసీ ఇవ్వకుండా ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. తుది వేతన పత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాకపోవడం తో ఆమె జీతం తీసుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యా యి. పలుమార్లు తనకు ఎల్‌పీసీ ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను కోరినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆమె ఔటర్ రింగ్‌రో డ్డు ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెం ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. మాతృసంస్థ నుంచి అనేకమార్లు ఎల్‌పీసీ పంపాలని కోరినా రిజిస్ట్రార్ స్పందించకపోవడంతో శైలజ గత ఆగస్టు 22న మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నవంబర్ ఒకటో తేదీలోగా ఓపెన్‌కోర్టుకు హాజరై నివేదిక ఇవ్వాల్సిందిగా రిజిస్ట్రార్‌ను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఆదేశించారు. కోర్టుకు హాజరైన రిజిస్ట్రార్ ఆమె బదిలీ అవుతూ బాధ్యతలు అప్పగించలేదని కమిషన్ దృష్టికి తెచ్చారు. రిజిస్ట్రారే స్వయంగా ఆమెను మాతృసంస్థకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన విషయంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, అదే రోజు మధ్యాహ్నం శైలజ ఎల్‌పీసీని సీల్డ్‌కవర్‌లో ఉం చి కమిషన్‌కు సమర్పించారు. నాలుగేళ్లగా ఆమెకు రావాల్సిన వేతనాన్ని ఈ నెల 12వ తేదీలోగా చెల్లించి, తమకు సమగ్రమైన నివేదికను అందజేయాలని ప్రభుత్వాన్ని సోమవారం కమిషన్ ఛైర్మన్ సుభాషణ్‌రెడ్డి ఆదేశించారు.

Udaya Kumar Gali

,

0 Responses to "జీతం కోసం నాలుగేళ్ల పాటు ఎదురు చూపులు"

Post a Comment