'వైద్య పరీక్ష' ఆర్టీఐ పరిధిలోకి రాదు: సీఐసీ
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నిరాకరించింది. వైద్యుడు, రోగికి మధ్యనున్న సంబంధం విశ్వాసంతో కూడుకొని ఉన్నదని, అందువల్ల వైద్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఝాన్సీ నివాసి అర్జేష్ కుమార్ మాధోక్ తన కుమారుడు ఆదిత్యకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్డీ)లో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలను ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాలని సీఐసీని కోరారు. ఆ వైద్య పరీక్షలు మాధోక్ భార్య కోరితేనే నిర్వహించామని, ఇప్పుడు ఆ నివేదిక వివరాలను ఇతరులకు వెల్లడించమని సీడీఎఫ్డీ పేర్కొంది. సీడీఎఫ్డీ నిర్ణయాన్నిసీఐసీ సమర్థించింది. వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను కోరడం ఆమె ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడమేనని సీఐసీ వ్యాఖ్యానించింది.
0 Responses to "'వైద్య పరీక్ష' ఆర్టీఐ పరిధిలోకి రాదు: సీఐసీ"
Post a Comment