ప్లాట్లను విక్రయించొద్దు

9:24 PM

(0) Comments

నెలసరి వాయిదాల చొప్పున డబ్బు వసూలు చేసి అనంతరం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుంటున్నారని బాధితులు ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఫోరం కేసును విచారణకు స్వీకరించి తుది తీర్పు వెలువడే వరకు ఆ ప్లాట్ల క్రయ, విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 'శ్రీ సాయిమిత్ర హౌసింగ్ కార్పొరేషన్' రియల్ ఎస్టేట్ సంస్థ హయత్‌నగర్ మండలంలోని సుర్మాయిగూడ గ్రామంలో వెంచర్ వేసి, వాయిదాల పద్ధతిన డబ్బు చెల్లిస్తే కాలపరిమితి ముగియగానే రిజిస్ట్రేషన్ చేయించి ప్లాట్లను అప్పగిస్తామని ప్రచారం చేసింది. దీంతో ఎల్లారెడ్డిగూడకి చెందిన డి. బ్రహ్మనాయుడు 2005 నవంబర్ 5న ఆ వెంచర్‌లోని 167, 168 ప్లాట్లకై తన తల్లి పేరిట రూ. 1,18,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నారు. 2007 జనవరి 9న మరో రూ. 1,52,000లు కాలపరిమితి కంటే ముందే పూర్తి మొత్తాన్ని చెల్లించారు. వాటితోపాటు అభివృద్ధి ఖర్చులకు గాను రూ.20,000లు, రిజిస్ట్రేషన్ ఖర్చులకు 15,000లు కూడా సంస్థకు ముట్టజెప్పారు. అనంతరం సంస్థ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించింది. దీంతో ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ న్యాయవాది ద్వారా ఓ లీగల్ నోటీస్ పంపినప్పటికీ, సంస్థ నుంచి కాని దాని నిర్వాహకుడు కోటేశ్వర్‌రావు నుంచి కాని స్పందన రాకపోవడంతో బాధితులు రంగారెడ్డి జిల్లా ఫోరంను ఆశ్రయించారు. ఫోరం ఆ రెండు ప్లాట్లపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Udaya Kumar Gali

, ,

0 Responses to "ప్లాట్లను విక్రయించొద్దు"

Post a Comment