ఇఎంఆర్ఐ సర్వీసు లకు మరో 122 అంబులెన్స్లు
సత్యం ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఇఎంఆర్ఐ సర్వీసు లకు ఈ యేడాది అదనంగా మరో 122 అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చనుందని, ఈ యేడాది ఇఎంఆర్ఐ, హెచ్ఆర్ఎంఐ సర్వీసులకోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద 32 కోట్లరూపాయలను కేటాయించనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి సంభాని చంద్రశేఖర్ చెప్పారు. ఇఎంఆర్ఐ,హెచ్ఎంఆర్ఐ సర్వీసుల నిర్వహణకోసం 95శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చడానకి అవగాహన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, సత్యం ఫౌండేషన్ ప్రతినిధుల తరుపున సచివాలయంలో సంతకాలు జరిగాయిం. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆరోగ్యసమాచార సర్వీసులకు సంబంధించి సత్యం ఫౌండే షన్ వద్ద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 380 అంబులెన్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యంఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్న మూడు జిల్లాల్లో ఆరోగ్య సమాచార సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు. ఇఎంఆర్, హెచ్ఎంఆర్ఐ లోగోల స్థానంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ లోగోలను ఇక మీదట ఉపయోగించనున్నట్లు మంత్రి చెప్పారు.
0 Responses to "ఇఎంఆర్ఐ సర్వీసు లకు మరో 122 అంబులెన్స్లు"
Post a Comment