సమస్యలను పట్టించుకోని సెల్‌ఫోన్ సంస్థలు

6:58 PM

(0) Comments

సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఇండియా మొబైల్ సర్వీసెస్ (ఐబీఎస్) సర్వే నిర్వహించి తేల్చింది. సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల కోసం రూపొందించే కస్టమర్ కేర్ సర్వీస్ (సీసీఎస్) కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని పెదవి విరిచింది.
సర్వే అధ్యయన ప్రధానాంశాలివి.
* వినియోగదారులు తమ ఫిర్యాదులపై సీసీఎస్ నుంచి సంతృప్తికర సమాధానం పొందాలంటే కనీసం ఆరు నిమిషాలు పడుతోంది.
* దేశంలో 11 సెల్ సంస్థలున్నా, వినియోగదారులకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చే వాటిని వేళ్లమీద లెక్కబెట్టవచ్చు.
* టెలిఫోన్ రెగ్యులేట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల సేవలకు సంబంధించి అనేక విధివిధానాలు నిర్దేశించింది. అయితే ప్రొవైడర్లు వాటిని అందుకోలేకపోతున్నారు.
* సేవల వైఫల్యానికి అపరిమితంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య కూడా కారణమే.
* వీటిపై ప్రభుత్వం తగిన చర్యలు చేపడితేనే వినియోగదారులకు ఆశించిన స్థాయిలో సేవలు అందుతాయి.

Udaya Kumar Gali

,

0 Responses to "సమస్యలను పట్టించుకోని సెల్‌ఫోన్ సంస్థలు"

Post a Comment