పొయ్యి కొంటేనే రీ కనెక్షన్
'ఒకటి కొంటే మరోటి ఉచితం' అనే చౌకబేరం కాదిది. 'ఒకటి కొనకపోతే... అర్హమైన మరోదాన్నీ పొందలేరు' అన్న ఖరీదైన కొత్త పథకం ఇది. దీన్ని నడిపిస్తున్నది చమురు కంపెనీలు. అమలుచేస్తున్నది రాష్ట్రంలోని గ్యాస్డీలర్లు. ఇప్పటికే వివిధ గ్యాస్ సమస్యల్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారుడు తాజాగా చమురు కంపెనీల 'గ్రీన్ స్టౌ' మంటపై కుతకుతా ఉడికిపోతున్నాడు. 'మేం సరఫరాచేసే గ్రీన్ లేబుల్ స్టౌను కొంటేనే మీకు కనెక్షన్లు ఇచ్చేది' అంటూ గ్యాస్డీలర్ల ప్రతినిధులు ఇళ్లకొచ్చీ మరీ చేస్తున్న ఒత్తిళ్లు వినియోగదారులకు దిమ్మదిరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతానికి రీ కనెక్షన్ కోసం వచ్చేవారిపై ఇలాంటి ఒత్తిళ్లు చేస్తున్నారు. బలవంతంగా స్టౌలు కొనిపిస్తున్నారు. మున్ముందు గ్యాస్ కనెక్షన్ కలిగిన రాష్ట్రంలోని కోటి మూడు లక్షల కుటుంబాలకూ ఈ స్టౌలను అంటగట్టేందుకు చమురు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా భారీ ఆదాయంపై కన్నేశాయి.
కొత్త స్టౌ కొనసాల్సిందేనన్న ఒత్తిళ్లు గతంలో గ్యాస్ డీలర్ల కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఉండేవి. ఒకవేళ కొత్త స్టౌ కొనకపోయినా కొన్నిసార్లు చూసీ చూడనట్లు వదిలేసి రీ కనెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు డీలర్ల ప్రతినిధులే వినియోగదారుడి ఇంటికి వెళుతున్నారు. కొత్త స్టౌ కొనకపోతే మాత్రం రీ కనెక్షన్ ఇవ్వడం లేదు.
రీఫిల్ చేసిన గ్యాస్ సిలిండర్లను ఇంకొన్ని ఎక్కువ రోజులు వినియోగించుకునేందుకు వీలుగా గ్రీన్లేబుల్ స్టౌల తయారీని చమురు కంపెనీలు మొదలు పెట్టించాయి. వీటి వల్ల కాలుష్యం ఏర్పడదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. వీటిని గ్యాస్ డీలర్ల ద్వారా వినియోగదారులకు విక్రయించాలని తలపెట్టాయి. ఇందులో తొలివిడతగా... రీ కనెక్షన్ కోరుకునే వారికి విక్రయించాలని నిర్ణయించాయి. ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి బదిలీపైనో, ఇతరత్రా కారణంతోనో వినియోగదారులు మారితే... రీ-కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. వీరికి కనెక్షన్ ఇవ్వాలంటే కొత్త గ్రీన్ లేబుల్ స్టౌ కొనాల్సిందేనని డీలర్లు షరతు పెడుతున్నారు. సంబంధిత వినియోగదారుని ఇంటికి గ్యాస్ డీలర్ల ప్రతినిధులు వెళ్లి వారు ఉపయోగిస్తున్న స్టౌను పరిశీలిస్తున్నారు. ఈ పాత స్టౌ స్థానే తమ దగ్గరున్న గ్రీన్లేబుల్ స్టౌను కొనాల్సిందేనని పట్టుబుడుతున్నారు. అలా కొన్నాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు. అప్పటి దాకా వినియోగదారుడు ఉపయోగిస్తున్న స్టౌకు రూ.100 నుంచి రూ.200 వరకు లెక్కగడుతున్నారు. వారు ఇచ్చే గ్రీన్ స్టౌకు మాత్రం రేటును రూ.700 నుంచి రూ.2 వేల వరకు వసూలుచేస్తున్నారు. దీంతో పాటు సురక్ష ట్యూబ్ పేరుతో రూ.180 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా జరిగాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు.
కొత్త స్టౌ కొనసాల్సిందేనన్న ఒత్తిళ్లు గతంలో గ్యాస్ డీలర్ల కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఉండేవి. ఒకవేళ కొత్త స్టౌ కొనకపోయినా కొన్నిసార్లు చూసీ చూడనట్లు వదిలేసి రీ కనెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు డీలర్ల ప్రతినిధులే వినియోగదారుడి ఇంటికి వెళుతున్నారు. కొత్త స్టౌ కొనకపోతే మాత్రం రీ కనెక్షన్ ఇవ్వడం లేదు.
రీఫిల్ చేసిన గ్యాస్ సిలిండర్లను ఇంకొన్ని ఎక్కువ రోజులు వినియోగించుకునేందుకు వీలుగా గ్రీన్లేబుల్ స్టౌల తయారీని చమురు కంపెనీలు మొదలు పెట్టించాయి. వీటి వల్ల కాలుష్యం ఏర్పడదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. వీటిని గ్యాస్ డీలర్ల ద్వారా వినియోగదారులకు విక్రయించాలని తలపెట్టాయి. ఇందులో తొలివిడతగా... రీ కనెక్షన్ కోరుకునే వారికి విక్రయించాలని నిర్ణయించాయి. ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి బదిలీపైనో, ఇతరత్రా కారణంతోనో వినియోగదారులు మారితే... రీ-కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. వీరికి కనెక్షన్ ఇవ్వాలంటే కొత్త గ్రీన్ లేబుల్ స్టౌ కొనాల్సిందేనని డీలర్లు షరతు పెడుతున్నారు. సంబంధిత వినియోగదారుని ఇంటికి గ్యాస్ డీలర్ల ప్రతినిధులు వెళ్లి వారు ఉపయోగిస్తున్న స్టౌను పరిశీలిస్తున్నారు. ఈ పాత స్టౌ స్థానే తమ దగ్గరున్న గ్రీన్లేబుల్ స్టౌను కొనాల్సిందేనని పట్టుబుడుతున్నారు. అలా కొన్నాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు. అప్పటి దాకా వినియోగదారుడు ఉపయోగిస్తున్న స్టౌకు రూ.100 నుంచి రూ.200 వరకు లెక్కగడుతున్నారు. వారు ఇచ్చే గ్రీన్ స్టౌకు మాత్రం రేటును రూ.700 నుంచి రూ.2 వేల వరకు వసూలుచేస్తున్నారు. దీంతో పాటు సురక్ష ట్యూబ్ పేరుతో రూ.180 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా జరిగాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు.